వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు భోజనాలు ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబద్ : ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర వ్యాఫ్తంగా నిర్వహిస్తున్న సామాజిక న్యాయ వారోత్సవాలు ఇవాళ్టితో ముగుస్తున్నాయి. గత నెల జ్యోతిరావు ఫూలే వర్దంతి నుంచి ప్రారంభమైన సామాజిక న్యాయ సదస్సులు ఇవాళ, అంభేద్కర్‌ వర్దంతి సందర్బంగా పూర్తవుతున్నాయి. సదస్సుల చివరి రోజు సామూహిక సహపంక్తి భోజనాల కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత చిరంజీవి మెదక్ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని సింగన్న గూడెం అనే మారుమూల పల్లెలో జరిగే కార్యక్రమాల్లో పాల్లోంటున్నారు.

మరోవైపు, చిరు పర్యటన కోసం సింగన్నగూడెం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పీఆర్పీ నేత హరిరామజోగయ్య పరిశీలించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా మెదక్ జిల్లాకు వస్తున్న చిరుకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సహపంక్తి భోజనాలకు చిరంజీవి, ఈ సింగన్నగూడ, కొక్కొండ గ్రామాలను ఎంపిక చేసారు.

గతంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వీటిని సందర్శించారు. తర్వాత, అధికారంలోకొచ్చిన చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాన్ని కొక్కొండ నుంచే శ్రీకారం చుట్టారు. ప్రస్తుత సీఎం వైఎస్ కూడా ప్రతపక్షనేతగా ఉండగా ప్రజాసమస్యలపై పోరును ఇక్కడినుంచే మొదలుపెట్టారని గ్రామస్థులంటున్నారు. ఇన్ని సెంటిమెంట్ల వల్ల చిరంజీవి కూడా ఈ గ్రామానికి రావాలనుకున్నట్లు సమాచారం. హైకోర్టు రోడ్ షోలకు బ్రేక్ వేయడంతో ప్రజా అంకితయాత్రను వాయిదా వేసుకున్న చిరంజీవి కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా అక్కడ జరిగే సామూహిక సహపంక్తి భోజనాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X