చిరు భోజనాలు ప్రారంభం
మరోవైపు, చిరు పర్యటన కోసం సింగన్నగూడెం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పీఆర్పీ నేత హరిరామజోగయ్య పరిశీలించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా మెదక్ జిల్లాకు వస్తున్న చిరుకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సహపంక్తి భోజనాలకు చిరంజీవి, ఈ సింగన్నగూడ, కొక్కొండ గ్రామాలను ఎంపిక చేసారు.
గతంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వీటిని సందర్శించారు. తర్వాత, అధికారంలోకొచ్చిన చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాన్ని కొక్కొండ నుంచే శ్రీకారం చుట్టారు. ప్రస్తుత సీఎం వైఎస్ కూడా ప్రతపక్షనేతగా ఉండగా ప్రజాసమస్యలపై పోరును ఇక్కడినుంచే మొదలుపెట్టారని గ్రామస్థులంటున్నారు. ఇన్ని సెంటిమెంట్ల వల్ల చిరంజీవి కూడా ఈ గ్రామానికి రావాలనుకున్నట్లు సమాచారం. హైకోర్టు రోడ్ షోలకు బ్రేక్ వేయడంతో ప్రజా అంకితయాత్రను వాయిదా వేసుకున్న చిరంజీవి కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అక్కడ జరిగే సామూహిక సహపంక్తి భోజనాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.