ఏసీబి వలలో గుంటూరు ట్రాన్స్కో ఇన్స్పెక్టర్
గుంటూరు : గుంటూరు ట్రాన్స్కో ఇన్స్పెక్టర్ తిమ్మనాయుడు ఇంటిపై శనివారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. అతనికి సంబంధించిన అనంతపురం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లలో ఉన్న ఇల్లపై ఏకధాటిగా ఈ దాడులు నిర్వహించారు.ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో సుమారు రెండు కోట్ల రూపాయల ఆస్తులు బయటపడినట్లు పేర్కొన్నారు. ఇంకా సోదాలు జరుగుతున్నాయని, అన్ని విషయాలు ఈ రోజు సాయంత్రానికి మీడియా ముందు ఉంచుతామని ఎసిబి అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications