వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాట్రిక్..దీక్షిత్!

By Staff
|
Google Oneindia TeluguNews

Sheela Dixit
న్యూఢిల్లీ: ముంబయి ఉగ్రవాద దాడుల నీడలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావాన్ని అధిగమించి కాంగ్రెస్‌ మూడోసారి విజయం సాధించింది.మరో ప్రక్క ''కాంగ్రెస్‌ పాలన ఖరీదై పోయింది'' అంటూ దేశ రాజధాని ఢిల్లీలో భాజపా సాగించిన ప్రచారం ఫలించలేదు. దశాబ్దకాలం తర్వాత విజయం ఖాయమనుకున్న పార్టీని మట్టి కరిపించారు. అలాగే కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బ కొడుతుందని ఆశించిన బీఎస్పీ 'దళిత్‌-బ్రాహ్మిణ్‌ జోడో' నినాదం కూడా ఢిల్లీలో పెద్దగా ఫలించలేదు. షీలా దీక్షిత్‌ హాట్రిక్‌ సాధించారు. ఇక ఢిల్లీ శాసనసభకు పోటీచేసిన 81 మంది మహిళల్లో ముగ్గురే ఎన్నికయ్యారు. గత సభలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ముస్లిములు ఐదుగురు ఎన్నికయ్యారు. ఢిల్లీ ఫలితాలతో ఢిల్లీ పీసీసీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొనగా, ఢిల్లీ భాజపా కార్యాలయం నిర్మానుష్యంగా మారిపోయింది.

షీలా దీక్షిత్ పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను ఆమె అవలీలగా అధిగమించారు. పార్టీకి ముచ్చటగా మూడోసారి తిరుగులేని విజయాన్ని అందజేశారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఢిల్లీలో ఓట్లను చీల్చకపోయి ఉంటే కాంగ్రెస్‌ మరిన్ని సీట్లు గెల్చుకొని ఉండేది.బీజెపికి కూడా బీఎస్పీ తన శక్తిమేర నష్టం కలగజేసింది. ఈసారి కాంగ్రెస్‌ అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికను పూర్తిగా ముఖ్యమంత్రి షీలాకే కట్టబెట్టింది. అయినా ఢిల్లీలో కాంగ్రెస్‌ గెలిచిందనడం కన్నా షీలా విజయం సాధించారనడం సబబుగా ఉంటుందని అంతా అంటున్నారు. ప్రత్యర్థులను నిలువరించడమేకాదు పార్టీలో ఏళ్ల తరబడి నెలకొన్న కుమ్ములాటలనూ ఆమె సమర్థంగా ఎదుర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X