వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేడు కోస్తా పోలీసు అధికారుల సమావేశం
విశాఖపట్నం: కోస్తాజిల్లాల పోలీసు అధికారుల సమావేశం బుధవారం విశాఖలో జరగనుంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కదలికలు చురుగ్గా ఉండటం మన రాష్ట్రంపై వారి దృష్టి ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉగ్రవాదులు మంబయి దాడులకు సముద్రమార్గాన్ని ఎంచుకోవటంతో కోస్తా తీరంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చిస్తారు. కోస్తా జిల్లాల ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొంటారు.
Comments
Story first published: Wednesday, December 10, 2008, 11:38 [IST]