వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షీణించిన ఆటోమొబైల్స్ పరిశ్రమ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ వాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్య ప్రభావం భారత ఆటోమొబైల్‌ రంగంపై స్పష్టంగా కనపడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్‌లో వాహన విక్రయాలు గణనీయంగా పడిపో యాయి. గడచిన నవంబర్‌ మాసంతో ఆటోమొబైల్‌ రంగం 18 శాతం క్షీణించి సంక్షోభ కోరల్లో చిక్కుకున్నది. భారత ఆటోమొబైల్‌ ఉత్పత్తిదారుల సంఘం (ఎస్‌.ఐ.ఎ.ఎమ్‌) బుధవారం విడుదల చేసిన స్టాటస్టిక్స్‌, సంక్షోభం అంచున నిలిచిన ఆటోమొబైల్‌ రంగ దీనస్థితిని తెలియజేస్తున్నాయి.

గత నవంబర్‌ మాసంతో పోలిస్తే ఈ ఏడాది ఆటోమొబైల్‌ రంగం 17.98 శాతం క్షీణించింది. గత నవంబర్‌ మాసాంతానికి దేశంలో మొత్తం 8,67,243 వాహన విక్రయాలు జరగగా, ఈ ఏడాది కేవ లం 7,11,281 వాహనాలను మాత్రమే విక్రయించినట్లు ఎస్‌.ఐ.ఎ.ఎమ్‌. స్టాటస్టిక్స్‌ వివరిస్తున్నాయి. ఇందులో వాణిజ్య వాహన అమ్మకాలు అత్యధికంగా 49.52 శాతం క్షీణించాయి. 1998 నాటి 48.6శాతం కనిష్ట అమ్మకాల రికార్డును బద్దలు కొట్టాయి.

దీనిని బట్టి ఉద్యోగ యు వత కొనుగోలు శక్తి మందగించినట్లు వేరే చెప్పనవసరం లేదని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.ఇక ఒక్క టాటా మోటార్స్‌ మాత్రం సమాంతర వృద్ధిరేటుతో దూసుకెళుతోంది. ఇది నానో కారు ప్రవేశపెట్టడంతో కలిగిన సానుకూల పరిణామంగా చెప్పవచ్చనని నిపుణులు తెలియచేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X