వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహిరంగ సభలతోనే చిరు సరి

By Staff
|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి: రోడ్‌షోలపై స్టేను హైకోర్టు కొనసాగిస్తుండటంతో ప్రధాన పట్టణాలు, మండలకేంద్రాల్లో బహిరంగసభలు నిర్వహించాలని ప్రజారాజ్యం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 18 లేదా 19నుంచి మూడు రోజులపాటు చిరంజీవి మెదక్‌ జిల్లాలో పర్యటిస్తారు. పటాన్‌చెరులో బహిరంగసభలో పాల్గొంటారు. అదేరోజు సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌ బహిరంగసభల్లో పాల్గొంటారు. రెండవరోజు నారాయణఖేడ్‌నుంచి సభను ప్రారంభించి జోగిపేట, మెదక్‌ మీదుగా నర్సాపూర్‌ చేరుకుని అక్కడి సభల్లో ప్రసంగిస్తారు.

చివరిరోజైన మరునాడు గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక, రామాయంపేట సభల్లో పాల్గొని తూప్రాన్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకుంటారు. చిరు పర్యటన జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సాగుతుందని పీఆర్పీ జిల్లాకన్వీనర్‌ నారాయణ తెలిపారు. రోడ్ షోలను హైకోర్టు నిషేధించడంతో బహిరంగ సభలతోనే చిరంజీవి కార్యక్రమాలను సరిపెట్టాల్సి వస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X