వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో తెలుగు నేతల ధర్నాలు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం తెలుగు రాజకీయ నాయకుల ధర్నాలు చూపరులను ఆకట్టుకున్నాయి. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు గురువారం ధర్నా చేశాయి. ఈ ధర్నాలో తెలుగుదేశం, వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో పాటు ఇతర పార్టీల ముఖ్య నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై ఇదే ఆఖరు పోరాటం కావాలని చంద్రబాబు ఈ ధర్నా కార్యక్రమంలో అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి. మన రాష్ట్రంలోని 18 లక్షల ఎకరాల భూమిని కాపాడేందుకే ఈ పోరాటం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (ఎన్) అధ్యక్షుడు ఎ. నరేంద్ర తన అనుచరులతో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. వచ్చే ఎన్నికల్లోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చారని, అందుకే బలపరీక్ష సమయంలో యుపిఎకు ఓటేశానని చెబుతూ వచ్చిన నరేంద్ర తన మాట ఉత్తిదేనని తేలడంతో ఈ ధర్నాకు దిగినట్లు కనిపిస్తోంది. ఒత్తిడి తెస్తే ప్రభుత్వం దిగిరాదనే ఉద్దేశంతో తాను ధర్నాకు దిగినట్లు నరేంద్ర చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X