వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని చేస్తున్న మాకే పట్టం: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: బాగా పనిచేస్తున్న తమనే ప్రజలు గెలిపిస్తారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారం కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీతో సమావేశమయ్యారు. గంటసేపు జరిగిన సమావేశం వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చర్చించామన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక గురించి విలేకరులు అడగ్గా వైఎస్‌ చాలా సమయం ఉందని అన్నారు. అర్హులైన వారికి అవకాశం ఇస్తామన్నారు.

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారని ప్రశ్నించగా, పనిచేసినవారికి ప్రజలు పట్టం కడతారని రుజువైందని జవాబిచ్చారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత ఏప్రిల్‌, మేలలోనే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారా అని విలేకరులు అడగ్గా, తప్పకుండా అప్పుడే జరుగుతాయన్నారు. ఏప్రిల్‌ కన్నా ముందు జరిగే అవకాశం లేదని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X