వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాడి మీదా యాసిడ్ పోస్తాం: ప్రణీత

By Staff
|
Google Oneindia TeluguNews

Pranitha
హైదరాబాద్: తాము ఆస్పత్రుల నుంచి బయటకు రాగానే శ్రీనివాస్ మీద తామూ యాసిడ్ పోస్తామని స్వప్నికతో పాటు గాయపడిన ఆమె స్నేహితురాలు ప్రణీత అంటోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణీత శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడింది. స్పప్నిక స్నేహం మానేయాలని శ్రీనివాస్ తనను కూడా బెదిరించాడని ఆమె చెప్పింది. ఇంత జరుగుతుందని తాను అనుకోలేదని ఆమె చెప్పింది. మేము బయటకు రాగానే మేం వాడి మీద యాసిడ్ పోస్తామని ఆమె అంటోంది. స్వప్నిక, ఆమె తండ్రి ఆరు నెలల పాటు పోలీసు స్టేషను చుట్టూ తిరిగారన, పోలీసులు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదని ఆమె అంటోంది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వప్నికను శుక్రవారంనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే విద్యార్థినులపై యాసిడ్ దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. హోం మంత్రి కె. జానారెడ్డి కూడా శుక్రవారం స్పప్నికను పరామర్శించారు. జానారెడ్డిని లోక్ సత్తా , ఐద్వా కార్యకర్తలు ఉడ్డుకునే ప్రయత్నం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X