వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాక్సులు బద్దలు: అల్లు అరవింద్

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Aravind
గుంటూరు: వచ్చే ఎన్నికల్లో బాక్సులు బద్దలవుతాయని, తమ పార్టీ గెలిచి తీరుతుందని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. పొంచి ఉన్న పులి పంజా విసురుతుందని ఆయన అన్నారు. గుంటూరులో జరిగిన ఒక పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను కాంగ్రెసు కాపీ కొడుతోందని, అందుకే కొన్ని హామీలను తాము వెల్లడించడం లేదని, వాటిని ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామని ఆయన చెప్పారు.

ఈ నెల 25వ తేదీ నుంచి సంస్థాగత నిర్మాణాన్ని చేపడుతామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అన్నీ చేశామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. చేయాల్సింది ఎంతో ఉందని, అన్నీ చేశామని చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆయన అన్నారు. కాంగ్రెసు పచ్చి అబద్ధాలు మాట్లాడుతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X