లెప్ట్ నేతలతో బాబు విందు భేటీ

పొత్తులపై తెలుగుదేశం, వామపక్షాల నాయకులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో మంగళవారంనాడు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై తమ ప్రతిపాదనలను చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. ఈ విషయంలో మూడు పార్టీల మధ్య ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. తమతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా కలిసి వస్తుందని తెలుగుదేశంతో పాటు వామపక్షాలు కూడా గట్టిగా నమ్ముతున్నాయి. తెరాస కలిసి వస్తే సీట్ల సర్దుబాటు ఎలా ఉండాలనే విషయంపై కూడా ప్రాథమికంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications