వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తలకు లక్ష
న్యూఢిల్లీ : సెప్టెంబర్ 13న ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో నిందితులైన వారి తలకు లక్ష చొప్పున వెలకట్టారు. వారి ఆచూకి తెలిపిన వారికి ఆ మొత్తాన్ని బహుమతి గా ఇస్తామని కమిషనర్ దద్వాల్ వెల్లడించారు. అలాగే ఢిల్లీ ఈ పేలుళ్ళ కేసులో నిషేధిత సిమి ప్రమేయం ఉన్నదని పోలీసులు నిర్థారించడం తెలిసిందే. అనంతరం బాట్లా హౌస్లో జరిగిన ఎన్కౌంటర్లో పట్టుబడిన ఉగ్రవాది నుంచి పేలుళ్ళ కుట్రను పోలీసులు తెలుసుకోగలిగారు. అయితే ఈ దాడికి పథకం వేసిన 13 మంది ఉగ్రవాదుల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.దాంతో వారీ ప్రకటన జారీ చేసారు.ఈ ఆఫర్ ఒక సంవత్సరం పాటు ఉంటుందని మరో సీనియర్ ఆఫీసర్ తెలిపారు.ఇక ఈ బాంబు ప్రేలుళ్ళలో వందమంది దాగా గాయపడ్డారు..ఇరవై ఆరు మంది మరణించారు.
Comments
Story first published: Wednesday, December 31, 2008, 16:05 [IST]