తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
తిరుమలలో వివిధ విభాగాధికారులతో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. వీఐపీలను నియంత్రించి సర్వదర్శనానికే ఆ రెండు రోజులలో ఎక్కువ సమయం కేటాయించనున్నామన్నారు. సర్వదర్శనం, రూ. 50ప్రత్యేక దర్శనం, ప్రోటోకాల్, సెల్లార్ దర్శన అనుమతులకు వేర్వేరు క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతి కంపార్టుమెంటులో ఓ అటెండర్, పోలీస్ అధికారి, సాయుధ బలగాలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తాయన్నారు. సామాన్య భక్తుల సౌకర్యాలను దష్టిలో ఉంచుకొని వీఐపీలు కూడా సహకరించాలని అభ్యర్థించారు.
'1వతేదీన ప్రభాతసేవలైన తిరుప్పావై ప్రవచనం,అర్చన,తోమాల తదితరాలను ఏకాంతంగా 12.05గంటలకు ప్రారంభించి 1.45గంటలకు పూర్తి చేస్తారు.'2గంటల నుండి 2.45గంటల వరకు ప్రోటోకాల్ పాసులను అనుమతిస్తారు '3గంటల నుండి సర్వదర్శనం ప్రారంభం '500లకు మించకుండా వీఐపీ పాసులు మంజూరు '9.30గంటలకు 50రూపాయల ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.'గోకులంలో ఏర్పాటుచేసిన 6కౌంటర్ల ద్వారా బయోమెట్రిక్ విధానం ద్వారా ఉదయం 10గంటల నుండి సెల్లార్ దర్శనానికి అనుమతిస్తారు.
'50వేల మందికి ఉచిత అన్నదానం, శ్రీవారి నిత్యాన్నదానంతో పాటు అన్ని ప్రాంతాలలో సాంబారు, పెరుగన్నం ప్యాకెట్లు ఉచితంగా పంపిణీ చేస్తారు.'ముఖ్య న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రోటోకాల్ వర్తించే ఇతరులు స్వయంగా వస్తేనే పాసులు కేటాయిస్తారు. 'ఆ రోజులలో వచ్చే భక్తులకోసం 4లక్షల లడ్డూప్రసాదాలు ఇప్పటికే తయారుగా వుంచారు.'ఆ రోజులలో వీఐపీలకు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లుండవు