చిత్తూరులో ఏక్సిడెంట్..ఐదుగురు మృతి
చిత్తూరు: చిత్తూరు నుంచి తిరుపతికి వస్తున్న పాలవ్యాన్ కర్నాటక నుంచి వస్తున్న మారుతీ వ్యాన్ను పాలవ్యాన్ ఢీకొంది. మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. చంద్రగిరి బైపాస్ రోడ్డు వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. మృతి చెందిన వారిని కర్నాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications