ఒంటరి పోరాటం చేస్తా :చిరు

పార్టీలో కోవర్టులపై తమకు ఎటువంటి ఆందోళన లేదని చెప్పారు. చిరంజీవి దేశద్రోహి అన్న మంత్రి పొన్నాల వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఎవరు దోశద్రోహులో ప్రజలు నిర్ణయిస్తారని, ఆయన తప్ప ఇంకెవరైనా తనను దేశద్రోహి అంటే అప్పుడు ఆలోచించాలని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్పై షబ్బీర్ అలీ తరహాలో మీరు కూడా పొన్నాలపై పరువు నష్టం దావా వేస్తారా? అని ప్రశ్నించగా తనకు సమయాన్ని వృథా చేసే అలవాటు లేదన్నారు. నెల్లూరు జిల్లాలో పీఆర్పీ అభ్యర్థుల విషయమై పూర్తిస్థాయి కసరత్తు జరగలేదని, దీనిపై త్వరలోనే విధాన ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.
అవినీతిరహిత సమాజ స్థాపనే ప్రజారాజ్యం ధ్యేయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి నిర్దిష్ట ప్రక్రియ చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా వివిధ దశల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయంగా హుందాతనాన్ని కాపాడే విషయంలో కట్టుబడి ఉంటామని, తాము ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదని, అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలనే తాము విమర్శిస్తున్నామని వివరించారు.రాష్ట్రస్థాయిలో ఒకే గుర్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, ఈనెల పదో తేదీలోపు ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని, ఆ తర్వాత అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చిరంజీవి వివరించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications