ఆగస్టు 17నుండి ఏపీ అసెంబ్లీసమావేశాలు.. సీఎం చంద్రబాబు మంత్రులకు అలెర్ట్ అందుకే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. మెగా డీఎస్సీ పైన, సాయి కృష్ణ లాకప్ డెత్, శాంతిభద్రతల పరిరక్షణ, రైతుల సమస్యలు తదితర అంశాల పైన రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టింది ఈనెల 17వ తేదీన ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి.
ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు, అజెండాను ఖరారు చేస్తారు. అయితే ఈ వర్షాకాల సమావేశాలను నాలుగు రోజులపాటు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక దిశ నిర్దేశం చేశారు.

మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అసెంబ్లీ సమావేశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తే, సభ్యులు దానికి దీటుగా బదులు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. మెగా డీఎస్సీ, సాయి కృష్ణ లాకప్ డెత్, అసలు ఎన్నికల హామీలు సంక్షేమ పథకాల అమలు పైన సఫల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలను లేవనెత్తే అవకాశం ఉంటుందని, వాటికి స్పష్టమైన వివరణలు ఇవ్వాలని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు.
ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని వైసీపీ మాస్టర్ ప్లాన్
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, ఎల్ నినో వంటి హంసల పైన సభలో ప్రత్యేక చర్చ జరుగుతుంది. అంతేకాదు బీసీ రక్షణ చట్టం బిల్లును కూడా ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే వైసిపి ఈ సమావేశాలకు హాజరై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రతీ ప్రశ్నకి సమాధానం చెప్పాలని చంద్రబాబు సూచన
ప్రత్యర్థి పార్టీలు లేవనెత్తే అంశాలను గుర్తించి వాటికి అనుగుణంగా సమాధానం చెప్పేలా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నాయకులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండాలని ప్రతి మంత్రి కీలక సమావేశాలను నిర్వహించి సంబంధిత శాఖాధిపతుల నుంచి సమాచారం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.



Click it and Unblock the Notifications