సత్యం ఆడిట్ సంస్ధపై సిఐడి దాడులు
హైదరాబాద్: సత్యం సంస్థలో భారీగా అవకతవకలు జరిగేందుకు ఆడిట్ అధికారులే కారణమని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారి ఆడిటింగ్ సంస్థ ప్రైస్వాటర్ కూపర్స్(పీడబ్ల్యూసీ) కార్యాలయంపై ఈరోజు సీఐడీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
వీటి ఆధారంగా సంస్థ ఆర్థిక స్థితి గురించి ముందుగా తెలిసే సంస్థ సీనియర్ డైరక్టర్లు రామ్ మైనంపాటి, టి.ఆర్. ప్రసాద్, రామ్మోహన్ రావు లు తమ షేర్లను ముందుగా అమ్మినట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా ఈ ముగ్గురినీ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ తాత్కాలిక సీఈవో సత్యం మైనంపాటి క్లయింట్లతో మాట్లాడడానికి అమెరికా వెళ్ళినట్టు సత్యం వర్గాలు చెబుతున్నాయి.
Comments
Story first published: Tuesday, January 13, 2009, 13:44 [IST]