రాజు లేఖలో పొలిటీషియన్ల పేర్లు?
తాజాగా న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజి (ఎన్ఎస్ఇ) ఇన్వెస్టర్ల నుంచి అందిన సమాచారం ప్రకారం అవుననే సమాధానాలు వస్తున్నాయి. సత్యం లేఖపై ఎన్ఎస్ఇలో చర్చ ప్రారంభమయింది. దానితోపాటు సత్యం ఉత్థా్ధన పతనాలు, మేటాస్ ఏర్పాటు, నిధులను ఇతర అవసరాలకు మళ్లించిన వైనాన్నీ ఆయన తన లేఖలో న్యూయార్క్ స్టాక్ ఎ క్సేంజికి కూలంకషంగా వివరించి, జరిగినవన్నీ అనివార్య సంఘటన లేనంటూ అంగీకరించినట్లు తెలుస్తోంది.
భారత దేశంలో పెద్ద ప్రాజెక్టులు వస్తున్నప్పుడు రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటాయన్న వాస్తవం తనకు అనుభవంలోకి వచ్చిం దని రామలింగరాజు పేర్కొన్నారని తెలిసింది. రాజకీయ నాయకత్వాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మనుగడ ఉండదని తనకు అనేక అనుభవాలు నేర్పినందున, అనివార్య పరిస్థితుల్లోనే రాజకీయ ఒత్తిళ్లు, బ్లాక్మెయిలింగ్కు లొంగిపోవలసి వచ్చిందని తెలిపినట్టు సమాచారం. రాజకీయ ప్రముఖుల సహకారం లేకపోతే ఏ పనీ చేయలేమనీ, ఆ క్రమంలో రాష్ట్ర, జాతీయ రాజకీయ పార్టీ ప్రముఖులకు తొలి దశలో భారీ మొత్తంలో షేర్లు కేటాయించి, ఎన్నికల సమయంలో వాటిని సొమ్ముగా మార్చి ఇవ్వవలసి వచ్చిందని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ఎవరెవరికి ఎన్నెన్ని షేర్లు ఇచ్చారన్నదీ వెల్లడించినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రముఖులతో పాటు, జాతీయ ప్రముఖుల పేర్లు కూడా అందులో ప్రస్తావించినట్లు సమాచారం.