హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సత్యం' వెనుక వైఎస్ హస్తం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: సత్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హస్తం ఉందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మేటాస్ కు నాలుగేళ్ళ కాలంలో రాజశేఖరెడ్డి ప్రభుత్వం 38 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను కట్టబెట్టిందని ఆయన విమర్శించారు. కెసీఆర్ గురువారం మధ్యాహ్నం తనను కలిసి మహా కూటమికి మద్దతు ప్రకటించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సత్యం-మేటాస్ కుంభకోణం వివరాలను గణాంకాలతో సహా వెల్లడించారు.

రామలింగరాజు కుమారుడి కంపెనీ అయిన మేటాస్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మేటాస్ నుంచి వైఎస్ కు కొన్ని వేల కోట్ల కమిషన్లు లభించాయని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులపై సమీక్ష చేయాలని ప్రతిపక్షాలు కోరితే బుద్ధి లేదని ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X