వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సముద్రపు దొంగల చెరలో విశాఖ ఇంజినీర్
విశాఖపట్నం: భారత సరిహద్దు జలాల నుంచి ఓ చేపల పడవను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఈ పడవలో ఎనిమిది మంది కెన్యా ఇంజినీర్లు, ముగ్గురు భారత ఇంజినీర్లు ఉన్నారు. గత నెల ఏడో తేదీన వీరిని అపహరించిన హైజాకర్లు కెన్యా దేశీయులను విడిచిపెట్టారు. భారత ఇంజినీర్లను మాత్రం తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఈ ముగ్గురిలో విశాఖకు చెందిన శరవరణన్ అనే ఇంజినీరు కూడా ఉన్నారు. వీరిని వదిలివేయడానికి సముద్రపు దొంగలు పలు డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Thursday, January 15, 2009, 11:49 [IST]