నిజామాబాద్ జెడ్పీ కాంగ్రెస్ కే
నిజామాబాద్: నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం అయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటరమణారెడ్డి రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. జడ్పీలో కాంగ్రెస్కు బలం ఉన్నా అసమ్మతి బెడద ఉంది. జెడ్పీ చైర్మన్ పదవి చేజిక్కించుకోడానికి టీడీపీ, తెరాసలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేశాయి. ఓటుహక్కులేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరై సభ్యులను ప్రభావితం చేస్తారని భావించి టీడీపీ ముందే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఓటుహక్కు ఉన్న వారే అడుగుపెట్టాలని కోర్టు ఆదేశించింది. చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. జడ్పీ ప్రాంగణంలో ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
Story first published: Wednesday, January 21, 2009, 14:03 [IST]