కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కి విద్యుత్ షాక్ ప్రమాదం

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
కరీంనగర్: యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ విధ్యుత్ షాక్ కి గురి అయ్యారు. హుస్నాబాద్‌లో తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తుండగా పవన్‌ చేయి విద్యుత్తు వైర్లకు తగలడంతో ఆయనకు షాక్‌ తగిలింది. దీంతో అక్కడ కలకలం రేగింది. పవన్‌ కాన్వాయ్‌లో ఉన్న అంబులెన్స్‌లోని డాక్టర్లు ఆయనకు చికిత్స చేశారు. కొద్దిసేపటికి పవన్‌ కోలుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు వూపిరి పీల్చుకున్నారు.

ఇక కరీంనగర్‌ జిల్లా రెండో రోజు పర్యటనలో పవన్‌కళ్యాణ్‌ కాంగ్రెస్‌పై తన విమర్శలను కొనసాగించారు. ప్రసంగించిన ప్రతిచోటా కాంగ్రెస్‌ పార్టీని దుయ్యబట్టిన పవన్‌, నేతల అవినీతిని తప్పుపట్టారు. అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తరిమి కొట్టమని బుధవారం యువతకు పవన్‌కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. వంచన మాటలతో ముంచుతున్న కాంగ్రెస్‌ నయాదివాలాకోరు రాజకీయాలకు చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమైందని పవన్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు.

యువతను టార్గెట్‌గా చేసుకుని ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీ లక్ష్యాలను వివరించారు. తిమ్మాపూర్‌లోని డ్వాక్రా గ్రూపు మహిళలతో సమావేశమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X