వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దొంగ నోట్లు, బ్యాంక్ మేనేజర్ అరెస్టు
తిరుపతి: తిరుపతి తిరుచానూరులో ఉన్న ఆంధ్రాబ్యాంక్లో నకిలీ నోట్ల మార్పులో ఆ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ వెంకటాద్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం బ్యాంక్లో 2 లక్షల 91వేల రూపాయల మేర నకిలీ నోట్లు బ్యాంక్కు చేరాయి. సాయంత్రం బ్రాంచ్ మేనేజర్ ఆంజనేయులు, హెచ్ఆర్డిల పరిశీలనలో నకిలీనోట్లు బయటపడ్డాయి. ఎవరి ఆధ్వర్యంలో చెలామణి జరిగింది విచారించగా అసిస్టెంట్ మేనేజర్ వెంకటాద్రి ఆధ్వర్యంలో జరిగినట్లు కనుగొన్నారు. దీనిపై గత రాత్రి 11 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంకటాద్రి నివాసానికి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ నోట్ల చెలామణిలో ఎంతమంది ఉన్నది విచారణ జరుపుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Story first published: Saturday, January 24, 2009, 12:07 [IST]