వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. పేరేచర్లలోని ఓ పత్తిమిల్లులో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో సంఘటన పొన్నూరు మండలంలో జరిగింది. పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరులోని ఓ ఆయిల్ మిల్లులో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు కోట్ల రూపాయల మేర ఆస్థినష్టం జరిగింది. గత ఏడాది గుంటూరు మిర్చి యార్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని కోట్ల రూపాయల నష్ట వాటిల్లింది.
Comments
Story first published: Saturday, January 24, 2009, 11:26 [IST]