హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ కిదేం బుద్ధి?: చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తమ పార్టీతో పొత్తులపై చర్చలు జరిపిన తెలంగాణ రాష్ట్ర సమితి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీతో జత కట్టడానికి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విస్మయం వ్యక్తం చేశారు. తెరాస మహాకూటమిలో చేరాలని తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చిరంజీవి అన్నారు.

టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అని గతంలో టిడిపి విమర్శించారని, కేసీఆర్‌ది దొరల మనస్తత్వమని తెలుగుదేశం విమర్శించిందని, ఇప్పుడు అన్నీ మరచి ఒక్కటవ్వడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. అధికారమే పరమావధిగా ఒక్కటైన మహాకూటమి ఎంత బలంగా ఉంటుందో చెప్పలేమన్నారు. సిద్ధాంతాలు లేకుండా కేవలం రాజకీయ ఎత్తుగడలతో పొత్తులు ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ప్రజల అభీష్టానికి అనుకూలంగా ఉండే పార్టీ అని చెప్పారు. కొయ్యగుర్రం మీద కూర్చుని ముందుకూ వెనక్కూ ఊగుతూ ముందుకెళ్తున్నామని మహాకూటమి భావిస్తోందని చిరంజీవి ఎద్దేవా చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X