వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోయలో పడిన లారీ: 13 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బరేలీజిల్లాలో గల ఫతేగంజ్ ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. బరేలీ జిల్లా ఫతేగంజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి లోయలో పడిపోవడంతో వీరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.
ఐరన్ రాడ్ ల లోడుతో వెళ్తున్న లారీలో వారు ప్రయాణిస్తున్నారు. చాలామంది ఐరన్ రాడ్స్ గుచ్చుకోవడంతో మరణించారని జిల్లా పోలీసు చీఫ్ పియూష్ మోర్దియా చెప్పారు. గాయపడినవారిని జిల్లా ఆస్పత్రిలో చేర్చారు.
Comments
Story first published: Monday, February 2, 2009, 10:30 [IST]