కాంగ్రెస్ పతనం తప్పదు: పవన్
రైతులకు ప్రజారాజ్యం పార్టీ మద్దతుగా నిలుస్తుందని ఆయన చెప్పారు. తమకు న్యాయం చేయని ప్యాకేజీని రైతులు స్వీకరించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులను వీధుల్లోకి నెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. రైతును కన్నీళ్లు పెట్టించిన కాంగ్రెసుకు పతనం తప్పదని ఆయన అన్నారు. రైతు రాజ్యమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులనే దోపిడీ చేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వానికి రైతులు చరమగీతం పాడుతారని ఆయన అన్నారు. రైతులకు తగిన ప్యాకేజీ ప్రకటించే వరకు తమ మద్దతు ఉంటుందని నవ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు టి. దేవేందర్ గౌడ్ చెప్పారు. రైతులు తమ పొలాలను విడిచిపెట్టవద్దని, మరో మూడు నెలల్లో కాంగ్రెసు ప్రభుత్వం పతనమవుతుందని, అప్పుడు రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, February 2, 2009, 16:17 [IST]