గవర్నర్ చెప్పినవి నిజాలే: రోశయ్య

K Rosaiah
హైదరాబాద్: శాసనసభలో గవర్నర్ ఎన్డీ తివారీ చేసిన ప్రసంగం ఉత్తేజకరంగా ఉందని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య ప్రశంసించారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలన్నీ వాస్తవలేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్షాల సభ్యులు కొందరు అడ్డు తగిలే ప్రయత్నం చేశారని, నినాదాలు చేశారని, ఇది సరైంది కాదని ఆయన అన్నారు. కొంత మంది గవర్నర్ ప్రసంగం ప్రతులను చించి విసిరేయడాన్ని ఆయన ఆక్షేపించారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను తెలుగుదేశం సభ్యులు కొంత మంది చించి గాలిలోకి విసిరేశారు.

గవర్నర్ ప్రసంగం ప్రతులను తమ సభ్యులు చించినా తప్పేనని ఆయన అన్నారు. తమ సభ్యులు ప్రసంగం ప్రతులను చించిన విషయాన్ని తాను గమనించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలనే కాకుండా, 2009-10లో చేపట్టే కార్యక్రమాలను కూడా గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారని, ఆ కార్యక్రమాలను బడ్జెట్ లో మరింత వివరంగా ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+