వైయస్ కుమారుడి తిరుగు టపా: బాబు
తన కుమారుడిని చదివించుకునే స్థోమత తనకు లేదా అని అడిగారు. సాక్షి పత్రిక బండారం బయట పడిందనే ఉద్దేశంతోనే హెరిటేజ్ పై అధికార పక్షం రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. తన కుమారుడు ఆమెరికాలో కష్టపడి చదువుకున్నాడని, అందుకు తాను గర్విస్తున్నానని, కొంత అధికార పక్షానికి చెందినవారి పిల్లలు బజార్లో తిరుగుతున్నారని, కొంత మంది పిల్లలు అమెరికా వెళ్లి తిరుగుటపాలో వచ్చారని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణల మీద సిట్టింగ్ న్యాయమూర్తి విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద తన కుమారుడు చదువుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఎదురుదాడికి తాను భయపడేది లేదని ఆయన అన్నారు.
చంద్రబాబు కుమారుడి చదువు విషయంలో ఆరోపణలు ఉంటే నాలుగున్నర ఏళ్ల నుంచి ప్రభుత్వం ఏం చేస్తోందని, చర్యలు ఎందుకు చేపట్టలేదని అంతకు ముందు సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య ప్రశ్నించారు.