జగన్ సంస్థలపై చర్చకు పట్టు

YS Jagan
హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రారంభం కాగానే వై.ఎస్‌ జగన్‌ కంపెనీల అక్రమాలపై చర్చకు తెలుగుదేశం, వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి గురువారం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. వీటిని స్పీకర్‌ తిరస్కరించారు. అయినా విపక్షాలు దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి సభను 15 నిముషాలపాటు వాయిదావేశారు.

ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి వై.ఎస్‌ కుమారుడు జగన్‌ వ్యాపారసంస్థల కుంభకోణంపై ప్రత్యక్షపోరాటాలకు సిద్ధమవుతున్నట్లు మహాకూటమి నేతలు ప్రకటించారు. అసెంబ్లీలో ఈ చర్చ లేవనెత్తినా ప్రభుత్వం ఎదరుదాడికి దిగటంతో ప్రజల్లోకి ప్రత్యక్షంగా వెళ్లి ఆందోళన చేయాలని వారు నిర్ణయించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో వామపక్షాల నేతలు రాఘవులు, నారాయణ, తెరాస అధినేత కేసీఆర్‌ బుధవారం సాయంత్రం సమావేశమై దీనిపై చర్చించారు.

ఇది అంతర్జాతీయ స్థాయి కుంభకోణమని వారు వ్యాఖ్యానించారు. దీనిపై ఈనెల 13 న గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, ఆరోజునుంచి 16 వరకు నియోజకవర్గస్థాయినుంచి జాతీయస్థాయి వరకు ఆందోళనలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. వాల్‌స్ట్రీట్‌ కుంభకోణం దీనిముందు దిగదుడుపేనని సీసీఎం కార్యదర్శి రాఘవులు అన్నారు. రాష్ట్రంలో కుంభకోణాలన్నీ వై.ఎస్‌ కుటుంబం చుట్టూనే తిరుగుతున్నాయని అన్నారు. ఇది గిన్నీస్‌బుక్‌లో చోటుచేసుకోదగిన కుంభకోణమని సీపీఐ కార్యదర్శి నారాయణ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+