వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా ఎందుకలా అన్నారు?

By Staff
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
శ్రీనగర్‌: వేర్పాటువాదులు ప్రజాస్వామ్య స్రవంతిలో కలిసిపోవాలని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యమే విజయం సాధించడానికి వేర్పాటువాదులు గుర్తుంచుకోవాలని సోనియా అన్నారు. శ్రీనగర్‌ నుంచి మొదటిసారిగా అంతర్జాతీయ విమాన సర్వీసును సోనియా ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...వేర్పాటువాదులు ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ పిలుపును జమ్మూకాశ్మీర్‌ ప్రజలు ఖాతరు చేయలేదనీ...హింస, ఆందోళనల పట్ల విసుగు చెందిన ప్రజలు ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ప్రగతి వైపునకు అడుగులు వేస్తున్నారని ఆమె ప్రశంసించారు. దీన్ని చూసి విచ్ఛినకర శక్తులు పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని సోనియా అన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్య మూలాలు ఎంత బలంగా ఉన్నాయో జమ్మూకాశ్మీర్‌ ప్రజలు నిరూపించారని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో బయటి వ్యక్తులు చేస్తున్న హింస ఇక ఎంతోకాలం కొనసాగదని సోనియా అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X