వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైఎస్ మనిషి సూరికి క్షమాభిక్ష !
హైదరాబాద్: జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు 730 మందితో జాబితా ప్రక్రియ పూర్తవనుంది. జాబితాలో జూబ్లీహిల్స్ కారు బాంబు కేసులో శిక్ష పడ్డ గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి పేరు కూడా ఉందని విశ్వసనీయ సమాచారం. ఈ కేసులో శిక్ష అనుభవిస్తూనే తన ప్రత్యర్థి పరిటాల రవి హత్యకు కుట్రపన్నాడన్న అభియోగంపై ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు.ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
Comments
Story first published: Saturday, February 14, 2009, 12:13 [IST]