Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్ళీ మనమే వస్తాం: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను మరింత సమర్థంగా అమలుజరిపే కలెక్టర్లను కార్యోన్ముఖులను చేసేందుకు ప్రభుత్వం సోమవారం జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించిందని భావించవచ్చు. అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకుని పోవలసిన అవసరాన్ని ఆయన కలెక్టర్లకు నొక్కి చెప్పారు. అభయహస్తం పథకాన్ని ప్రస్తావించారు. ఇందిరక్రాంతిపథకం అమలుతీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను కోరారు.

మరో ఐదేళ్లు కలిసి పనిచేద్దామని ఆయన కలెక్టర్లతో అన్నారు. రాబోయే ప్రభుత్వం మనదేనని, మళ్ళీ మనం ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన కలెక్టర్లను ఉద్దేశించి అన్నారు. గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించామని, అందుకు కలెక్టర్ల సహకారం బాగుందని ఆయన అన్నారు. 2004 జూన్‌ 26, 27 తేదీల్లో మనం కాన్ఫరెన్స్‌ నిర్వహించామని, మళ్ళీ 2009 జూన్‌లో ఇలాగే సమావేశం జరుపుకుంటామని ఆయన కలెక్టర్లతో అన్నారు. ఎన్నికలకు రెండు నెలల సమయం ఉన్నందున ఈ రెండునెలలూ కరెంట్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+