ఎమ్మార్పీయస్ దాడులు, తాళాలు
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) కార్యకర్తలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. కార్యాలయాలపై దాడులు చేయడం, వాటికి తాళాలు వేయడం వంటి చర్యలకు దిగుతున్నారు. శుక్రవారం ఉదయం ఆందోళనకారులు సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ ను, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయ ద్వారానికి తాళం వేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశం జరుగుతుండగా ఎమ్మార్పీయస్ కార్యకర్తలు ఆ సమావేశం గది తలుపులు వేసి తాళం వేశారు.
ఎమ్మార్పీయస్ కార్యకర్తలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్యాలయం వద్ద, ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆఫీసులకు తాళం వేసి ధర్నాలు చేశారు. ఉద్యోగులను లోనకు వెళ్లనీయమంటూ గేట్ల వద్ద బైఠాయించటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. పటాన్చెరు, రాజమండ్రి, తాండూరు, వరంగల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల ఆర్టీఓ ఆఫీసుల వద్ద కూడా ఇదే కార్యక్రమాన్ని వారు కొనసాగిస్తున్నారు. శనివారం వరకు ఎమ్మార్పీయస్ కార్యకర్తల ఆందోళన కొనసాగుతుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications