వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రజ్యోతి, ఈనాడు..టీడీపీకే: వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
అనంతపురం: తెలుగుదేశం పార్టీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వత్తాసు పలుకుతూ ఏదేదో వక్రీకరిస్తూ వార్తలు రాస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీవ్రంగా విమర్శించారు. గురువారం తాడిపత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను కరువు నుంచి కాపాడేందుకు వీలుగా అనంతపురం జిల్లా కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో లేపాక్షి సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దానిని అడ్డుకోవడానికి తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వైఎస్‌ ఆరోపించారు.

సైన్స్ సిటీ ఏర్పాటైతే అనంతపురం జిల్లాలోని లక్షలాది మంది లబ్ధి పొందే అవకాశం వుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అది కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అక్కడ ఏర్పాటయ్యే సైన్స్ సిటీకి అవసరయ్యే మంచి నీటి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కడప జిల్లా సోమశిల నుంచి రెండు శతకోటి ఘనపుటడుగులు నీటిని తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఎకరా 50వేల రూపాయలు పలుకుతున్న భూములకు లక్షా 50 వేల రూపాయలు చెల్లించి సైన్స్ సిటీ కోసం కొనుగోలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుతగులుతున్నారన్నారు. రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తుంటే వీరు మాత్రం లేనిపోని ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X