పీఆర్పీ కి విజయశాంతి హెచ్చరిక
గురువారం సాయంత్రం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం బలోపేతానికి కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో తెలంగాణ వాదం లేదని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి శివశంకర్ ప్రశ్నించగా "అవునయ్యా...ఆ వాదం పడిపోతోంది కదా? బాగా క్షీణించింది కదా! టీఆర్ఎస్ ఏమైందో చూడండి. ఎక్కడుంది టీఆర్ఎస్?" అని వ్యాఖ్యానించారు.దానిపై టీఆర్ ఎస్ తీవ్ర స్ధాయిలో స్పందించింది. ఇక 12వ తేదీన నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో విజయశాంతి రోడ్ షో జరగనుంది.
Comments
Story first published: Friday, March 6, 2009, 12:11 [IST]