వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రచయిత పతంజలి ఇక లేరు

By Staff
|
Google Oneindia TeluguNews

KNY Patanjali
విశాఖపట్టణం: ప్రముఖ రచయిత, సాక్షి దినపత్రిక ఎడిటర్ పతంజలి ఈ రోజు (బుధవారం)కన్నుమూసారు. స్ధానిక సింహాద్రి హాస్పటల్ లో లివర్ కాన్సర్ కి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన స్వగ్రామం విజయనగరం జిల్లా ఆలమండ. ఆయన 1974 లో ఈనాడు విశాఖపట్టణం ఎడిషన్ లో సబ్-ఎడిటర్ కెరీర్ ప్రారంభించారు. 1983 లో ఉదయం పత్రికలో న్యూస్ ఎడిటర్ గా పనిచేసారు. ఉదయం మూతపడిన తర్వాత రచయితగా బిజీ అయ్యారు. వ్యంగ్య రచయితలకు ఆయన పెట్టింది పేరు.

కొంతకాలం ఆధ్రప్రభ, టీవీ-9లలో పనిచేసారు. ఆయన రచనల్లో వీరబొబ్బిలి, పిలక తిరుగుడు పువ్వు, ఖాకీవనం, గోపాత్రుడు, ఒక దెయ్యం ఆత్మ కథ, నువ్వు నేను, రాజుగారి వేట కథలు, అప్పన్న సర్ధార్, గెలుపు సరే బతకడం ఎలా రచనలు చాలా ప్రాచుర్యం పొందాయి. అలాగే ఆయన రాసిన నవల ఆధారంగా టబు ప్రధాన పాత్రలో ఇదీ సంగతి సినిమా ఈ మధ్యనే తెరకెక్కింది. అంతకు ముందు కూడా ఆయన కృష్ణ వంశితో పనిచేసారు. వ్యంగ్యానికే కొత్త రూపు ఇచ్చిన పంతంజలి గారి మృతికి దట్స్ తెలుగు ప్రగాఢ సంతాపం తెలియబరుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X