హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సాక్షి' పై 'ఈనాడు' కేసు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్:'సాక్షి' పేపరుపై మరో మారు 'ఈనాడు' విరుచుకుపడింది. ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనల విషయంలో పక్షపాత ధోరణి వహిస్తున్నారంటూ సాక్షిపై ఈనాడు సంస్ధ ప్రతినిధులు కోర్టులో రిట్ వేసారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని సాక్షి దినపత్రికకు ప్రకటనలు, నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఉషోదయ సంస్థ హ కోర్టులో రిట్ దాఖలు చేసింది. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన ఉషోదయ కంపెనీ డైరక్టర్ రామ్మోహనరావు ఈ రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు.

తమ సంస్థ ప్రభుత్వ ప్రకటనలను ప్రచురించినా నిదులు విడుదల చేయడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 226, 150 జీఓ లను ఆయన సవాలు చేశారు. సాక్షి పత్రికకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల అయిపోతున్నాయని కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి దీనికి సాక్షి ఛానెల్ లో రోజూ సాక్షి సంతకం అంటూ పోగ్రామ్ ఇస్తూ ఈనాడుని ఖండిస్తున్న జగన్మోహన రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X