శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పివిని అవమానించిన వైఎస్: ఎన్టీఆర్

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
శ్రీకాకుళం: తెలుగువారి ఆత్మ గౌరవం అంశాన్ని ప్రజల ముందుకు మొదటిసారిగా తెచ్చింది నటసార్వభౌమ నందమూరి తారకరామారావేనని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడు, తెలుగువారికి ఖ్యాతి తెచ్చిన ఆయనపై తెలుగుదేశం అభ్యర్ధిని నిలబెట్టకూడదని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఎన్టీఆర్ విశాల హృదయానికి అది నిదర్శనమన్నారు. కాంగ్రెస్ వారు మాత్రం పివి మరణిస్తే ఢిల్లీలో సమాధి కట్టకుండా హైదరాబాద్ తీసుకొచ్చి, శవం పూర్తిగా కాలకుండా దహన సంస్కారాలను పూర్తి చేశారని జూనియర్ ఎన్టీఆర్ అన్నప్పుడు జనం నుంచి మంచి స్పందన లభించింది.

శ్రీకాకుళం జిల్లాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పర్యటన మూడవ రోజు సాగుతోంది. శనివారం శ్రీకాకుళం, ఆముదాలవలస, హెచ్చర్ల, రాజం, పాలకొండలలో పర్యటన సాగుతుంది. ఉరకలెత్తిన యువరక్తం...ఉప్పొంగిన ఉత్సహం...వెల్లువెత్తిన ప్రజాభిమానం...పలకరించిన అభిమానుల సందడి వెరసి ఒక ఉత్సవంలా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ పర్యటన సాగుతోంది.

ఈ రోజు పర్యటనలో భాగంగా చిలక పాలెం జంక్షన్‌ రోడ్‌ షోలో మాట్లాడుతూ కొందరు నేతలు మాది సామాజిక న్యాయం గల పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఏం..టిడిపిలో సామాజిక న్యాయం లేదా మహిళలకు తెలుగుదేశంపార్టీ ప్రత్యేక స్థానం కల్పించి, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అది సామాజిక న్యాయం కాదా...రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం పేద ప్రజలను ఆదుకోలేదా...అది సామాజిక న్యాయం కాదా...

కులమత బేధాలు లేకుండా అన్ని వర్గాల వారికి పార్టీలో సీట్లు ఇచ్చింది అది సామాజిక న్యాయం కాదా...అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు నీరు కావాలని అంటుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం బీరును పొర్లిస్తుంది. నాడు టిడిపి జన్మభూమి అంటే నేడు కాంగ్రెస్‌ భూములను దోచుకుంటుంది. అంతెందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు పెట్టమని రాష్ట్ర ప్రజలు కోరితే 'రాజీవ్‌' పేరు పెట్టారు. ప్రధానమంత్రిగా చేసిన పీ.వి.నరసింహరావు పేరు ఎందుకు పెట్టలేదని జూ.ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X