హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు ఉమ్మడి గుర్తు పిటిషన్ వెనక్కి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఉమ్మడి ఎన్నికల చిహ్నం కేటాయించాలని కోరుతూ ప్రజారాజ్యం హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ఆకస్మికంగా ఉపసంహరించుకుంది. ఈకేసు హైకోర్టులో చాలా కాలంగా నలుగుతోంది. ఈరోజు మరోసారి ఈ పిటిషన్ విచారణకు రానున్న సమయంలో దానిని ఉపసంహరించుకుని ప్రజారాజ్యం ఆశ్చర్యం కలిగించింది.

హైకోర్టులో ఆలస్యమైపోవడం, చివరికి హైకోర్టులో ఏమవుతుందో తెలియని స్ధితి నెలకొనడంతో ఇక్కడ పిటిషన్ ను ఉపసంహరించుకుని సుప్రీంకోర్టులో రేపు పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. ప్రజారాజ్యం లీగల్ సెల్ చిరంజీవితో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు అయితే ఎన్నికల సంఘాన్ని స్పష్టంగా ఆదేశించగలదన్న ఆశతో రేపు పిటిషన్ దాఖలు చేయనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X