హైదరాబాద్:
ప్రభుత్వ
ప్రకటనలను
వార్తల
రూపంలో
ప్రసారం
చేస్తోందంటూ
వైఎస్
జగన్
సారధ్యంలోని
సాక్షి
ఛానల్పై
మహాకూటమి
నేతలు
ప్రధాన
ఎన్నికల
అధికారి
ఐ.వి.సుబ్బారావుకు
ఫిర్యాదు
చేశారు.
ముఖ్యమంత్రి
వైఎస్
కుమారుడు
జగన్
ఈ
ఛానెల్
ద్వారా
యదేచ్ఛగా
కోడ్
ఉల్లంఘనకు
పాల్పడుతున్నారని
వారు
ఆరోపించారు.
గతంలోనే
పలుమార్లు
ఈ
విషయం
ఈసీ
దృష్టికి
తీసుకువచ్చామని,
దీనికి
సంబంధించిన
చర్యల
విషయంలో
జాప్యం
జరుగుతోందని
ఆ
పార్టీ
సీనియర్
నేత
ఎర్రంనాయుడు
అన్నారు.
ఈసీ
వెంటనే
స్పందించి
సాక్షి
ఛానల్
తప్పుడు
ప్రచారాన్ని
అడ్డుకోవాలని
ఆయన
ఐ.వి.సుబ్బారావుకు
వినతిపత్రం
సమర్పించారు.