వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులివెందులలో నిఘా కెమెరాలు

By Staff
|
Google Oneindia TeluguNews

CC Camera
పులివెందుల: కడప జిల్లా పులివెందులలో పోలింగ్‌పై క్లోజ్డ్‌ సర్క్యూట్‌ (సీసీ) కెమెరాలతో నిఘా వేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మాజీ సలహాదారు, ఎన్నికల నిఘా వేదిక కమిటీ సభ్యుడు కె.జె.రావు ప్రకటించారు. సోమవారం ఈ నియోజకవర్గ పరిధిలోని లింగాల మండల గ్రామాల్లో కమిటీ సభ్యులతో కలిసి ఆయన పర్యటించారు.

అనంతరం పులివెందులలో విలేఖరులతో మాట్లాడుతూ...ఇక్కడ ఎన్నికలు జరిగే తీరుపై గ్రామీణ ఓటర్లనుంచి సమాచారం సేకరించినట్లు తెలిపారు. మురారిచింతల, కోమన్నూతల , ఎగువపల్లె, దిగువపల్లె, గ్రామాలను చుట్టి వచ్చామని, పులివెందులలో ఎన్నికలు ఏకపక్షంగా సాగుతాయని ప్రజలు వివరించారని పేర్కొన్నారు.

ఈసారి పోలింగ్‌ నిష్పక్ష పాతంగా జరిగేలా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కె.జె.రావు వెల్లడించారు. అందువల్ల ఓటర్లు నిర్భయంగా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవచ్చునని భరోసా ఇచ్చారు. వేదిక తరఫున పోలింగ్‌ నాడు పులివెందులలో ఉంటానని వివరించారు. కమిటీ సభ్యులు లక్ష్మణ్‌ రావు, వెంకటేశ్వరరావు, శ్రీరాములు, సెంట్రల్‌ యూనివర్శిటీ ఫ్రొఫెసర్‌ చిన్నయ్యసూరి తదితరులు ఆయన వెంట పర్యటనలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X