వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్ కేసు వద్దన్న అంజలీ

By Staff
|
Google Oneindia TeluguNews

Anjali Waghmare
ముంబయి: ముంబయి దాడుల కేసు నిందితుడు మొహమ్మద్ అజ్మల్ కసబ్ తరఫున వాదించడానికి అంజలీ వాగ్మారే నిరాకరించారు. కసబ్ తరఫున వాదించడానికి ప్రత్యేక కోర్టు ఆమెను నియమించింది. అయితే తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ఆమె ఆ కేసును చేపట్టడానికి నిరాకరించారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తాను కేసును వాదించకూడదని నిర్ణయించుకున్నట్లు అంజలీ వాగ్మారే చెప్పారు.

కసబ్ తరఫున వాదించడానికి ముందుకు వచ్చిన అంజలీ ఇంటి వద్ద దాదాపు వంద మంది ధర్నా చేశారు. ఆమె ఇంటిపైకి రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఆమెకు గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకు దిగిన వారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు కావచ్చునని పోలీసులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X