డ్యూయెట్లు కాదు: చిరుపై వైయస్

ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ప్రాజెక్టుల వద్దంటున్నారని, ప్రాజెక్టులు లేకుండా రైతులకు నీళ్లు ఎలా ఇస్తారని ఆయన అన్నారు. ఒక సిద్ధాంతం లేనివారు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఆలోచించాలని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు. అధికారంకోసం గడ్డి కరుస్తున్న మహాకూటమిని తుంగలో తొక్కాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. దుర్మార్గుడైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును నమ్మవద్దన్నారు. ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్కు పట్టంగ ట్టాలని పిలుపు ఇచ్చారు. అనంతరం ఆయన హెలికాప్టర్లో ఉట్నూరు వెళ్లారు. ఆ తరువాత ఇచ్చోడ, బజార్హత్నూర్, బోథ్, నేరడిగొండలలో రోడ్షోల్లో పాల్గొంటున్నారు. రాత్రికి నిర్మల్లో బహిరంగసభలో పాల్గొని అక్కడే బస చేస్తారు.












Click it and Unblock the Notifications