జయసుధపై పోలీసు కేసు

నామాలగుండు ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం కొద్ది దూరంలో ఉన్న చౌరస్తాలో పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. దీనితో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. స్థానికులు కొందరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి దృష్టికి కూడా తీసుకెవెళ్లారు. పోలీసులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నామాలగుండుకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. జయసుధ ప్రారంభించిన పార్టీ కార్యాలయానికి అనుమతి లేదన్న విషయాన్ని గుర్తించారు.
పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో ప్రజల జీవనానికి ఆటంకం కలిగించిన సంఘటనను పరిగణలోకి తీసుకున్నారు. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని పేర్కొంటూ, అభ్యర్థిపై కేసు నమో దు చేయాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి స్థానిక పోలీసులను ఆదేశించారు. చిలకలగూడ పోలీసులు జయసుధపై కేసు నమోదు చేసి, పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాలు, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications