హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉలుకెందుకు: చిరుకు దాసరి ప్రశ్న

By Staff
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
హైదరాబాద్: మేస్త్రీ సినిమా చూసి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. తాను ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాను తీయలేదని, ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా తీస్తున్నట్లు వస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన ఒక కార్యక్రమంలో అన్నారు. తన 46 ఏళ్ల సినీ జీవితంలో ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఏనాడూ తాను సినిమా తీయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ అవసరం కూడా తనకు లేదని ఆయన చెప్పారు.

సామాజిక కోణం నుంచి సినిమా తీసినప్పుడు అందులో సామాజిక, రాజకీయ ప్రస్తావన రావడం సహజమని, అదే మేస్త్రీ సినిమాలో జరిగిందని ఆయన వివరించారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని దాసరి నారాయణ రావు ఈ సినిమా తీసినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X