మృతుడు సతీష్ ది చిక్ మంగుళూర్
కర్నూలు: కర్నూలు జిల్లా కెసి కెనాల్ పై నిర్మాణంలో ఉన్న వంతెన ప్రమాదంలో మరణించిన సైట్ ఇంజనీర్ సతీష్ కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగూళూర్ కు చెందినవాడు. గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సతీష్ మృతదేహాన్ని వెలికి తీశారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో శిథిలాల కింద కూరుకుపోయిన బాలకార్మికుడు రవీంద్రను, కార్మికురాలు అంజమ్మను సురక్షితంగా బయటకు తీశారు. మీడియాకు కనిపించకుండా వారిద్దరిని కాంట్రాక్టర్లు అక్కడి నుంచి తప్పించారు.
కాంట్రాక్టర్ పై పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. ప్రమాదం నుంచి బయట పడిన కార్మికురాలు అంజమ్మది మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దమందడి గ్రామం. రవీంద్రది మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం పాంపురం. భోజన విరామ సమయంలో వంతెన కూలడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. కార్మికులందరూ భోజనాలకు వెళ్లడంతో చాలా మంది ప్రమాదం నుంచి బయట పడ్డారు. లేకుంటే మరింత మంది ప్రమాదంలో చిక్కుకుని ఉండేవారు. వంతెన నిర్మాణంలో చాలా మంది బాలకార్మికులే పని చేస్తున్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications