పవన్ కళ్యాణ్ కు హైకోర్టు ఊరట

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయంటూ న్యాయవాది, మహబూబ్నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డి.కిరణ్ కుమార్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించిన మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ జి.భవానీప్రసాద్ విచారణ చేపట్టారు. ఫిర్యాది కిరణ్ కుమార్ కు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను నిలిపివేస్తూ జస్టిస్ భవానీ ప్రసాద్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications