నిమ్స్ కి రూ.కోటి ఫైన్
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన నిమ్స్ ఆస్పత్రికి దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి అక్షింతలు పడ్డాయి. పెషెంట్కు సరిగ్గా వైద్యం చేయనందుకు నిమ్స్ హాస్పిటల్కు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్యం కోసం వచ్చిన రోగిని నిర్లక్ష్యం చేసినందుకు హైదరాబాద్లోని నిమ్స్ యాజమాన్యానికి సుప్రీం కోర్టు భారీ జరిమానా విధించింది. కొన్ని రోజుల క్రితం నిమ్స్లో చేరిన ఐటీ ఉద్యోగి సుదర్శన్ అనే వ్యక్తికి సరైన వైద్యసేవలు చేయనందుకు అతడు హైకోర్టును ఆశ్రయించాడు.
విచారించిన కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే దీనిపై నిమ్స్ వైద్య సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ తీర్పు వెలువర్చింది. సుదర్శన్కు కోటి రూపాయలు చెల్లించాలని నిమ్స్ను ఆదేశించింది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఇంత స్థాయిలో నష్ట పరిహారం విధించడం ఇదే తొలిసారి. విధులను నిర్లక్ష్యం చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.