వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతికి ఎస్పీ మద్దతు లేఖ

By Staff
|
Google Oneindia TeluguNews

Amar Singh
న్యూఢిల్లీ: కేంద్రంలో యుపిఎకు తమ పార్టీ పార్లమెంటు సభ్యుల మద్దతు లేఖను సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు మంగళవారం అందజేశారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కేంద్రంలో యుపిఎ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తనను ఆదేశించారని అమర్ సింగ్ రాష్ట్రపతికి సమర్పించిన లేఖలో తెలియజేశారు.

ఎస్పీకి 23 మంది లోకసభ సభ్యులున్నారు. మరో ఇద్దరు స్వతంత్రుల మద్దతు కూడా ఎస్పీకి ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో ఎస్పీ పొత్తు కుదుర్చుకోలేకపోయింది. ఆర్జెడీ, ఎల్జెపిలతో కలిసి ఎస్పీ నాలుగో కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసింది. తాము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్దంగా ఉన్నామని ములాయం సింగ్ సోమవారం మైన్పూర్ లో చెప్పారు. కొత్త ప్రభుత్వాన్ని తాము బలపరుస్తామని అమర్ సింగ్ తర్వాత చెప్పారు.

రెండు రోజుల క్రితం తాను, ములాయం సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలవడానికి వెళ్లామని, తమకు మద్దతివ్వాలని మన్మోహన్ తమను అడిగారని, నిన్న సోమవారం కూడా ప్రధాని తమ మద్దతు కోరారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X